Jdnews Vision…
సెయింట్ జోసెఫ్ కాలేజ్ ,జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ విభాగం అధ్వర్యం లో అడోబ్ తో
ప్రీ అండ్ పోస్ట్-ప్రొడక్షన్ ప్రయాణం అంశం పై ఒకరోజు సదస్సు
అడోబ్ తో
ప్రీ అండ్ పోస్ట్-ప్రొడక్షన్ ప్రయాణం అంశం పై ముఖ్య వక్త గా ప్రొఫెసర్ ఫాదర్ అశోక్ లింగంపల్లి
నర్సీపట్నం డాన్ బాస్కో డిగ్రీ కళాశాల జర్నలిజంప్రొఫెసర్.
హైదరాబాద్ సెయింట్ పయస్ డిగ్రీ కళాశాలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా సేవలందిస్తున్న
నిష్ణాతుడైన చలనచిత్ర నిర్మాత అయిన ప్రొఫెసర్ ఫాదర్ అశోక్ లింగంపల్లి, “కాన్సెప్ట్ టు కట్: ఎక్స్ప్లోరింగ్ ప్రీ అండ్ పోస్ట్-ప్రొడక్షన్ జర్నీ విత్ అడోబ్” అనే కీలక ఉపన్యాసాన్ని అందించారు. అలాగే జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ను వృత్తిగా కొనసాగించేందుకు విద్యార్థులని ప్రోత్సహించారు.
ఉపన్యాసం చలనచిత్ర నిర్మాణం యొక్క మూడు క్లిష్టమైన దశలని అశోక్ వివరించారు. ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్ మరియు పోస్ట్-ప్రొడక్షన్. స్టోరీబోర్డింగ్ మరియు స్క్రిప్ట్ రైటింగ్తో సహా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఖచ్చితమైన ప్రణాళిక యొక్క ప్రాముఖ్యతను లింగంపల్లి నొక్కిచెప్పారు.
సమాజంపై మీడియా ప్రభావం అంశంపై ఫాదర్ లింగంపల్లి తన ఉపన్యాసం లో
ఔత్సాహిక చిత్రనిర్మాతలను రిస్క్లు తీసుకోవాలని మరియు కంటెంట్పై దృష్టి పెట్టాలని విద్యార్థులకి సూచించారు.
ప్రెస్ మరియు మీడియా ఇంఛార్జి డాక్టర్ PK జయ లక్ష్మి మాట్లాడుతూ జర్నలిజం పట్ల ప్రేరణాత్మక అంశాలని ప్రస్తావించారు.
జర్నలిజం ప్రజాస్వామ్యానికి వెన్నెముక, మీరు ఎప్పుడూ సత్యానికి సంరక్షకులు గా వుండాలన్నారు. జర్నలిజం కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, ప్రజా ప్రయోజనాలకు సేవ చేయాలనే పిలుపు అని పేర్కొ న్నారు.
జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ అధ్యాపకులు డా. నవ్యశ్రీ ,ప్రెస్ మరియు మీడియా ఇంఛార్జి డాక్టర్ PK జయ లక్ష్మి . జర్నలిజం విద్యార్థులు పాల్గొన్నారు.